తూర్పు దిగవల్లిలో మాజీ తెలుగు రైతు అధ్యక్షుడి నూతన గృహప్రవేశం..
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
తూర్పు దిగవల్లిలో మాజీ తెలుగు రైతు అధ్యక్షుడి నూతన గృహప్రవేశం.. పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన నియోజకవర్గ మాజీ తెలుగు రైతు అధ్యక్షులు జగ్గవరపు వెంకటరెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలిశారు. నూతన గృహప్రవేశ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వెంకటరెడ్డి కుటుంబానికి అభినందనలు తెలిపారు.