www.ntodaynews.com
త్రివర్ణ కాంతులతో నాగార్జునసాగర్ మువ్వన్నెల విద్యుత్ దీపాలంకరణ
తెలంగాణ
త్రివర్ణ కాంతులతో నాగార్జునసాగర్ మువ్వన్నెల విద్యుత్ దీపాలంకరణ
మాచర్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ జలాశయం త్రివర్ణ కాంతులతో వెలుగొందింది. సాగర్ ప్రధాన డ్యాంను శుక్రవారం రాత్రి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
మువ్వన్నెల వెలుగుల్లో మెరిసిన డ్యాం అందాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు స్థానికులతో పాటు పెద్ద సంఖ్యలో పర్యాటకులు సాగర్ డ్యాం పరిసరాలకు చేరుకున్నారు. దేశభక్తి భావాన్ని చాటేలా చేపట్టిన ఈ విద్యుత్ దీపాలంకరణ అందరి ప్రశంసలు అందుకుంది.