BREAKING
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు
www.ntodaynews.com

తుమ్మగూడెం గ్రామం అభివృద్ధిలో మరో ముందడుగు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 08:04 PM
38 వీక్షణలు


ప్రధాన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం తుమ్మగూడెం గ్రామంలో ప్రజల చిరకాల అవసరమైన ప్రధాన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగపడే ఈ రహదారి నిర్మాణంతో మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయి.

గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రధాన రహదారి నిర్మాణానికి సహకరించిన నూజివీడు ఎమ్మెల్యే, గృహ నిర్మాణ శాఖ మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

రోడ్డు మంజూరు నుంచి నిర్మాణ పనుల ప్రారంభం వరకు నిరంతరం కృషి చేసి, గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తుమ్మగూడెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మందలపు రాజారావును గ్రామ ప్రజలు అభినందించారు.

మంత్రి కొలుసు పార్థసారథి చొరవ, మందలపు రాజారావు కృషితో తుమ్మగూడెం గ్రామానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన రహదారి కల సాకారమవుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు.

గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.