www.ntodaynews.com
మండల పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ
పుంగనూరు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి: రాఘవేంద్ర రాజు
పుంగనూరు టౌన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షుడు అక్కిసాని భాస్కర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మువ్వన్నెల జాతీయ పతాకం దేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు మరియు రాజ్యాంగ విలువలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దేశాభివృద్ధిలో బాధ్యతాయుత భాగస్వాములుగా మారాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యదర్శి రామకృష్ణ రెడ్డి (కిట్టు), వైఎస్సార్సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#RepublicDay
#77thRepublicDay
#IndianConstitution
#NationalFlag
#MahatmaGandhi
#ViksitBharat
#DemocracyInIndia
#ConstitutionalValues
#PublicLeadership
#LocalGovernance
#Punganur
#AndhraPradesh
Follow us on
Website
Facebook
Instagram
YouTube