www.ntodaynews.com
ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ
పుంగనూరులో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకుల పాల్గొనడం
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు
పుంగనూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) మాట్లాడుతూ, పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే లభించిందన్నారు. ఇప్పటికీ వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా, ప్రజలు మాత్రం ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
నాయకుడు కోలాసొము శేఖర్ మాట్లాడుతూ, అనేక మహానుభావుల త్యాగ ఫలితంగానే నేడు 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. పార్టీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా జనసేన పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు సీ. చంద్రశేఖర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అంటేనే ప్రజలకు నిజమైన స్వేచ్ఛ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నాయకుడని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనుభవంతో కూడిన పాలన అందిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర డైరెక్టర్ మణికంఠ, పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, ఎన్ఆర్ఐ రాయల్ కుమార్, తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ ప్రసాద్, పుంగనూరు ఏఎంసీ డైరెక్టర్ అరుణ, రొంపిచర్ల ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి శివ, లీగల్ సెల్ నాయకుడు శ్రీనివాసులు, పట్టణ ఉపాధ్యక్షులు నందకుమార్, పట్టణ నాయకులు భార్గవ్, గోపీనాథ్, అనిల్, సునీల్, పుంగనూరు రూరల్ నాయకుడు రవి, పులిచెర్ల నాయకులు నవీన్, మునికృష్ణ, అంజి మరియు జనసైనికులు పాల్గొన్నారు.
#RepublicDay
#77thRepublicDay
#Punganur
#JanaSenaParty
#TDPJanaSenaAlliance
#CoalitionGovernment
#AndhraPradeshPolitics
#ConstitutionOfIndia
#Patriotism
Follow us on
Website
Facebook
Instagram
YouTube