www.ntodaynews.com
నిందితునికి 21 ఏళ్ళ కారాగార శిక్ష
తెలంగాణ
ఫోక్సొ కేసులో సంచలన తీర్పునిచ్చిన నల్గొండ ఫోక్సో ఇన్చార్జి న్యాయస్థానం
NTODAY NEWS: చిట్యాల
నిందితునికి 21 ఏళ్ళ కారాగార శిక్ష
30000 జరిమానా, 10 లక్షలు నష్టపరిహారం:
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో 8 ఏళ్ల క్రితం మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల మైనర్ బాలికపై బలవంతంగా ఒక వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటనపై ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం నల్గొండ ఫోక్సో ఇన్చార్జి న్యాయస్థానం నిందితునికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువడించింది. వివరాల్లోకి వెళితే తేదీ ఫిబ్రవరి 1, 2018 న నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, వనిపాకల గ్రామానికి చెందిన మూడవ తరగతి చదివే మైనర్ బాలిక (8) ఇంట్లో టీవీ చూస్తుండగా అదే గ్రామానికి చెందిన దోమల రాములు తాగిన మైకంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిబ్రవరి 11, 2018 న స్థానిక చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సోమవారం ఫోక్సో న్యాయస్థానం ఇన్చార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితునికి 21 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా 30,000 రూపాయలు జరిమానా విధించడంతో పాటు బాదితురాలికి 10 లక్షలు నష్టపరిహారం కింద ప్రకటించింది.
Follow us on
Website
Facebook
Instagram
YouTube