BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

82 మంది సిబ్బందికి షోకాజు నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
19 Dec, 2025 - 06:40 PM
219 వీక్షణలు

భువనగిరి జిల్లా ఆసుపత్రి సిబ్బంది 82 మందికి షోకాజు నోటీసులు జారీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మూడు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, విధులకు హాజరు కానీ వారిపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్, సమయపాలన పాటించని 63 మందికి షోకాజు నోటీసులు జారీ, విధులకు గైహాజరు అయినా 19 మందికి షోకాజు నోటీసులు జారీ, ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. ఆసుపత్రిలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వలన సంబంధిత శానిటేషన్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని ప్రతి వార్డు కలియతిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డులో ఉన్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ...డాక్టర్లు,సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎన్ సియు, పీడియాట్రిక్, పోస్ట్ డెలివరీ, డెలివరీ విభాగాల సిబ్బంది పనితీరును పరిశీలించారు.మేల్, ఫిమేల్ ఇన్ పేషెంట్ వార్డు లో రోగులతో మాట్లాడారు. వాళ్ళు ఎందుకు అడ్మిట్ అయ్యారో డాక్టర్ లని అడిగారు. రోగులను రోజు పెట్టే ఆహారం ఎలా ఉంటుంది అని ఆరా తీశారు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న నలుగురితో మాట్లాడి వైద్య సమయానికి వస్తున్నార అని అడిగి తెలుసుకున్నారు.ఇటీవల డెలివరీ అయిన గర్భిణీలతో మాట్లాడుతూ డాక్టర్లు మంచిగా వైద్యం అందిస్తున్నారా? అన్ని పరీక్షలు చేస్తున్నారా? టీకాలు వేస్తున్నారా అని ఆరా తీశారు ఎమర్జెన్సీ వార్డులో ఎక్కువ ఏ సమస్య మీద ప్రజలు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఓపి సమయంలో ఎంతమంది డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు అని ప్రశ్నించారు డాక్టర్లు మరియు సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవన నిర్మాణానికి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఆస్పత్రి సూపర్డెంట్ ,సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube