BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

82 మంది సిబ్బందికి షోకాజు నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
19 Dec, 2025 - 06:40 PM
151 వీక్షణలు

భువనగిరి జిల్లా ఆసుపత్రి సిబ్బంది 82 మందికి షోకాజు నోటీసులు జారీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మూడు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, విధులకు హాజరు కానీ వారిపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్, సమయపాలన పాటించని 63 మందికి షోకాజు నోటీసులు జారీ, విధులకు గైహాజరు అయినా 19 మందికి షోకాజు నోటీసులు జారీ, ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. ఆసుపత్రిలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వలన సంబంధిత శానిటేషన్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని ప్రతి వార్డు కలియతిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డులో ఉన్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ...డాక్టర్లు,సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎన్ సియు, పీడియాట్రిక్, పోస్ట్ డెలివరీ, డెలివరీ విభాగాల సిబ్బంది పనితీరును పరిశీలించారు.మేల్, ఫిమేల్ ఇన్ పేషెంట్ వార్డు లో రోగులతో మాట్లాడారు. వాళ్ళు ఎందుకు అడ్మిట్ అయ్యారో డాక్టర్ లని అడిగారు. రోగులను రోజు పెట్టే ఆహారం ఎలా ఉంటుంది అని ఆరా తీశారు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న నలుగురితో మాట్లాడి వైద్య సమయానికి వస్తున్నార అని అడిగి తెలుసుకున్నారు.ఇటీవల డెలివరీ అయిన గర్భిణీలతో మాట్లాడుతూ డాక్టర్లు మంచిగా వైద్యం అందిస్తున్నారా? అన్ని పరీక్షలు చేస్తున్నారా? టీకాలు వేస్తున్నారా అని ఆరా తీశారు ఎమర్జెన్సీ వార్డులో ఎక్కువ ఏ సమస్య మీద ప్రజలు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఓపి సమయంలో ఎంతమంది డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు అని ప్రశ్నించారు డాక్టర్లు మరియు సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవన నిర్మాణానికి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఆస్పత్రి సూపర్డెంట్ ,సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube