10 నిమిషాలు దాటితే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్..
10 నిమిషాలు దాటితే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్.. న్యూయార్క్ స్మార్ట్ టాయిలెట్లలో కొత్త నిబంధన!
న్యూయార్క్:
పబ్లిక్ టాయిలెట్ల వినియోగంలో కొత్త విధానం అమల్లోకి రానుంది. న్యూయార్క్లో ఏర్పాటు చేయనున్న స్మార్ట్ పబ్లిక్ టాయిలెట్లలో వినియోగదారులకు 10 నిమిషాల కౌంట్డౌన్ టైమర్ ఉండనున్నట్లు సమాచారం.
టైమర్ పూర్తయ్యే సమయానికి ముందుగా వినియోగదారుడికి హెచ్చరిక ఇవ్వనుండగా.. నిర్ణీత సమయం దాటిన తర్వాత టాయిలెట్ డోర్ ఆటోమేటిక్గా తెరుచుకునేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
పబ్లిక్ టాయిలెట్ల కొరతను తగ్గించడం, ఎక్కువ మంది ప్రజలకు వాటిని అందుబాటులో ఉంచడం, అలాగే టాయిలెట్లను డ్రగ్స్ వినియోగం, ఇతర అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించకుండా నిరోధించడం ఈ విధానం లక్ష్యంగా అధికారులు చెబుతున్నట్లు సమాచారం.
అయితే ఈ కొత్త విధానంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో లేదా ఆరోగ్య కారణాల వల్ల 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం అవసరమైనప్పుడు పరిస్థితి ఏమిటనే ప్రశ్నలను కొందరు నెటిజన్లు లేవనెత్తుతున్నారు.
స్మార్ట్ టెక్నాలజీతో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను మెరుగుపరిచే ప్రయత్నంగా ఈ విధానాన్ని అధికారులు భావిస్తున్నప్పటికీ.. నిర్ణీత సమయ పరిమితిపై మాత్రం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.