న్యాయవాది కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
NTODAY NEWS: గొల్లపల్లి మండలం
రోడ్డు ప్రమాదం లో గాయపడిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని కుటుంబ సభ్యులను కరీంనగర్ అస్పత్రి లో పరామర్శించిన - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాండ్ర సురేందర్ హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యలో ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయనకు వారి కుటుంబ సభ్యులకు గాయాలు కావడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున హాస్పిటల్కు చేరుకుని సురేందర్ ని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube