BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలి

తెలంగాణ
13 Jun, 2025 - 09:16 AM
267 వీక్షణలు
కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలి--యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య మెరుగుపరచాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి ఆదేశించారు.బీద కుటుంబం విద్యార్థులకు చదువుతూనే పేదరికం పోయి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.శుక్రవారం రోజున జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కళాశాల ప్రిన్సిపల్స్ తో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... కళాశాల వారిగా ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్ ను ఎన్ని అడ్మిషన్లు వచ్చాయని సమీక్షించారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి వారికి మంచిగా అర్థం అయ్యే విధంగా బోధన అందించాలన్నారు.పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విదార్థి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వం అందిస్తున్న సకల సౌకర్యాల, బోధన గురించి తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా పేద విద్యార్ధులకు లెక్చరర్ మంచిగా చదువు చెప్పి వారి జీవితాల్లో వెలుగులు కురిపిస్తే విద్యార్ధులకు అంతకమించినది ఇంకొకటి ఉండదన్నారు .టీచర్లు విద్యార్ధులకు మంచి చదువు అందిస్తే ఉన్నత స్థాయికి వెళ్లడం ద్వారా పేదరికం తొలగి పోతుందన్నారు. విద్యార్థులకు స్లిప్ టెస్ట్ లు పెట్టి అందులో వెనుకబడిన వారిని కేటగిరి వైజ్ గా తీసుకొని వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఒక్క విద్యార్ధి పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మంచి విద్యను అందించి వారి జీవితానికి అండగా నిలిచి సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ సమీక్షలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube