BREAKING
thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి
Date of Publish : 16 September 2026, 03:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గడప గడపకు వైఎస్సార్‌సీపీతో స్థానిక ఎన్నికలకు తిరువూరు వైసీపీ శ్రేణుల సన్నద్ధత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Sep, 2026 - 03:00 PM
5 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తిరువూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న గురువారం ఉదయం “గడప గడపకు వైఎస్సార్‌సీపీ” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు పట్టణ పరిధిలోని తొకపల్లి (మల్లకుంట) యాదవ్ బజార్‌లో ఉన్న కృష్ణుడి గుడి నుంచి ఉదయం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు రేగళ్ల మోహనరెడ్డి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, పార్టీ నాయకులు, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటికీ వెళ్లనున్నారు.

ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలిసి స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించనున్నట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, పట్టణంలోని ప్రతి వార్డులో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంచడం, ప్రజలతో మరింతగా మమేకం కావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పార్టీ నేతలు తెలిపారు.

కార్యక్రమ వివరాలు:

తేదీ: 17-09-2026, గురువారం

సమయం: ఉదయం 6:30 గంటలకు

ప్రారంభ స్థలం: తొకపల్లి (మల్లకుంట) యాదవ్ బజార్, కృష్ణుడి గుడి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ పట్టణ అధ్యక్షులు రేగళ్ల మోహనరెడ్డి కోరారు.