www.ntodaynews.com
ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం
అన్నమయ్య జిల్లా పుంగనూరు మినీ బైపాస్ రోడ్డులోని అంబేద్కర్ భవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 15 రోజులపాటు నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమాన్ని రోటరీ అధ్యక్షులు నాన బాల గణేష్, సెక్రటరీ సీఎస్ రాజారెడ్డి, యోగా గురువులు శ్రీమతి వనిత, జగన్మోహన్ రెడ్డి పాల్గొని యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించి శిక్షణ అందించారు. ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల నుంచి అంబేద్కర్ భవనంలో
ఈ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోటరీ సభ్యులు కోరారు. ప్రజలు
కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్, భాస్కర్ జట్టి, అనిల్ కుమార్, శివశంకర్, నక్క వేణుగోపాల్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.