www.ntodaynews.com
ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలవాలి: కవిత
తెలంగాణ
/
హైదరాబాద్
ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలవాలి: కవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత కోరారు.
మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆమె, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి త్యాగాలను ఎప్పటికీ మరవకూడదని అన్నారు. ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వరంగల్లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులు రాజేష్ నాయక్, యాకూబ్ రెడ్డిలు ముళ్లకంపపై పడి గాయపడిన ఘటనను ప్రస్తావించిన కవిత, వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య సహాయం, అవసరమైన మద్దతు అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు.