BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌ను నిలదీసిన భార్య

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 06:42 PM
67 వీక్షణలు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ కామర్స్ లెక్చరర్ వ్యవహారం కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువతిని వేధించేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

మచిలీపట్నంలోని ఓ మహిళా కళాశాలలో గతంలో పనిచేసి, ప్రస్తుతం అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న జాషువాపై ఈ ఆరోపణలు వచ్చాయి.

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతి పరిస్థితిని ఆసరాగా చేసుకుని, తన కోరికలు తీర్చాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఇందుకోసం మచిలీపట్నం గొడుగుపేట ప్రాంతంలోని ఓ అద్దె ఇంటికి యువతిని పిలిచినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న జాషువా భార్య అక్కడికి చేరుకుని భర్తను నిలదీసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధిత యువతికి హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు అండగా నిలిచి, ఘటనను బయటపెట్టినట్లు సమాచారం.