www.ntodaynews.com
ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్ను నిలదీసిన భార్య
ఆంధ్రప్రదేశ్
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ కామర్స్ లెక్చరర్ వ్యవహారం కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువతిని వేధించేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
మచిలీపట్నంలోని ఓ మహిళా కళాశాలలో గతంలో పనిచేసి, ప్రస్తుతం అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న జాషువాపై ఈ ఆరోపణలు వచ్చాయి.
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతి పరిస్థితిని ఆసరాగా చేసుకుని, తన కోరికలు తీర్చాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఇందుకోసం మచిలీపట్నం గొడుగుపేట ప్రాంతంలోని ఓ అద్దె ఇంటికి యువతిని పిలిచినట్లు తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న జాషువా భార్య అక్కడికి చేరుకుని భర్తను నిలదీసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధిత యువతికి హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు అండగా నిలిచి, ఘటనను బయటపెట్టినట్లు సమాచారం.