www.ntodaynews.com
ఉమ్మడిదేవరపల్లిలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
గంపలగూడెం, జూలై 27: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఉమ్మడిదేవరపల్లి గ్రామంలో సోమవారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రద్దైన కొన్ని పథకాలను తిరిగి పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.