www.ntodaynews.com
ఉండవల్లికి విచ్చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్
ఉండవల్లికి విచ్చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఘన స్వాగతం
అమరావతి సమీపంలోని ఉండవల్లిలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రుణమేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ముందుగా ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ శాలువాతో సత్కరించి ఆత్మీయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై నాయకులు స్వల్పంగా చర్చించారు.