www.ntodaynews.com
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 30: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఏలేరు జలాశయం నుంచి కాకినాడ జిల్లాకు 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడు ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొనే అవకాశమున్న సూపర్ ఎల్నినో పరిస్థితులు, సాగునీటి సంక్షోభంపై ఇద్దరు చర్చించారు. రైతులకు పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను వివరించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
అలాగే, సూపర్ ఎల్నినో ప్రభావంతో ఏర్పడే నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులు దృష్టి సారించాలని, ముందస్తు ప్రణాళికలతో సాగునీటి నిర్వహణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం.