BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలి ఎంఈవో 1మాసగిరి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 03:29 PM
59 వీక్షణలు

ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలి ఎంఈవో 1మాసగిరి శ్రీనివాస్ 

చాట్రాయి: పాఠశాలల్లో విద్యార్థులకు అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ సూచించారు. ప్రతి పాఠశాలలో ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడిని మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు నియమించి, సంబంధిత ఉపాధ్యాయుడు స్వయంగా భోజనాన్ని రుచి చూసి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు.


బుధవారం మండలంలోని ఎంపీయూపీఎస్ బూరుగుగూడెం పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.


అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ విద్య, పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.