ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలి ఎంఈవో 1మాసగిరి శ్రీనివాస్
ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలి ఎంఈవో 1మాసగిరి శ్రీనివాస్
చాట్రాయి: పాఠశాలల్లో విద్యార్థులకు అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ సూచించారు. ప్రతి పాఠశాలలో ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడిని మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు నియమించి, సంబంధిత ఉపాధ్యాయుడు స్వయంగా భోజనాన్ని రుచి చూసి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
బుధవారం మండలంలోని ఎంపీయూపీఎస్ బూరుగుగూడెం పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ విద్య, పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.