BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 02 June 2026, 10:24 am
Posted by : రావిపాటి ప్రభాకరావు

ఉప్పరపాలెం శివారులో జూదరుల అరెస్ట్ ​ఆరుగురు పట్టివేత..

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
02 Jun, 2026 - 10:24 AM
162 వీక్షణలు

ఉప్పరపాలెం శివారులో జూదరుల అరెస్ట్ ​ఆరుగురు పట్టివేత..రూ.3,200 స్వాధీనం.

​అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: ఎస్సై శివరామకృష్ణ.

​ఎడ్లపాడు మండల పరిధిలోని ఉప్పరపాలెం గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న జూదం తావులపై సోమవారం పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.​పోలీసుల కథనం ప్రకారం... ఉప్పరపాలెం గ్రామ శివారు ప్రాంతంలో కొందరు వ్యక్తులు చేరి జూదం ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఎడ్లపాడు పోలీసులు సదురు ప్రాంతంపై నిఘా పెట్టారు. పక్కా ప్రణాళికతో దాడి చేసి,జూదమాడుతున్న ఆరుగురినిపట్టుకున్నారు. వారి వద్ద నుండి జూదానికిఉపయోగిస్తున్న రూ. 3,200/- నగదును,  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

​ఈ సందర్భంగా ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ మాట్లాడుతూ... ప్రజలు ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని,అసాంఘిక పనులకు దూరంగా ఉండాలనిహెచ్చరించారు. మండల పరిధిలో ఎక్కడైనా జూదం, బెట్టింగులు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని ఎస్సై స్పష్టం చేశారు.