వాహనదారులపై మళ్లీ ఇంధన భారం
వాహనదారులపై మళ్లీ ఇంధన భారం : దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలుNTODAY NEWS హైదరాబాద్
దేశవ్యాప్తంగా వాహనదారులపై ఇంధన భారం మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను మరోమారు పెంచాయి. తాజా సవరణతో గడిచిన 10 రోజుల్లోనే ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్పై రూ. 2.84, అలాగే లీటర్ డీజిల్పై రూ. 2.86 మేర భారం పడింది. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే తక్షణమే అమలులోకి వచ్చాయని చమురు సంస్థలు ప్రకటించాయి. వరుస పెంపులతో సామాన్యుడి బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
ప్రధాన నగరాల్లో ఇవాళ్టి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని మెట్రో నగరాల్లో సవరించిన పెట్రోల్, డీజిల్ ధరలు (లీటరుకు) హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ రూ.115.62, లీటర్ డీజిల్ రూ.103.76
విజయవాడ : లీటర్ పెట్రోల్ రూ.118.28, లీటర్ డీజిల్ రూ.105.91
విశాఖపట్నం : లీటర్ పెట్రోల్ రూ.116.39, లీటర్ డీజిల్ రూ.104.11
వరంగల్ : లీటర్ పెట్రోల్ రూ.115.45, లీటర్ డీజిల్ రూ.103.58
ఢిల్లీ : లీటర్ పెట్రోల్ రూ.102.12, లీటర్ డీజిల్ రూ.95.20
కోల్కతా : లీటర్ పెట్రోల్ రూ.113.51, లీటర్ డీజిల్ రూ.99.82
చెన్నై : లీటర్ పెట్రోల్ రూ.107.77, లీటర్ డీజిల్ రూ.99.55
ముంబై : లీటర్ పెట్రోల్ రూ.111.21, లీటర్ డీజిల్ రూ.97.83 ఉన్నాయి.