BREAKING
ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి
www.ntodaynews.com

వాల్టా చట్టం ప్రకారమే బోర్లు వేయాలి : తహశీల్దార్ విజయ్ కుమార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
14 Aug, 2026 - 08:06 PM
73 వీక్షణలు

వాల్టా చట్టం ప్రకారమే బోర్లు వేయాలి : తహశీల్దార్ విజయ్ కుమార్ 

చిట్యాల: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణకు వాల్టా చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలని చిట్యాల మండల తహశీల్దార్ విజయ్ కుమార్ సూచించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని బోరుబండ్ల యజమానులతో తహశీల్దార్ విజయ్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బోరుబండి యజమాని భూగర్భ జలాల శాఖకు రూ.1,000 చలానా చెల్లించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న బోరుబండ్లకు మాత్రమే బోర్లు వేసే అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల భూముల్లో బోర్లు వేసే ముందు సంబంధిత రైతు వాల్టా చట్టం ప్రకారం ముందస్తు అనుమతులు పొందాడో లేదో బోరుబండి యజమానులు పరిశీలించాలని సూచించారు. అనుమతులు పొందిన భూముల్లో మాత్రమే బోర్లు వేయాలని, నిబంధనలు ఉల్లంఘించి బోర్లు వేస్తే సంబంధిత బోరుబండ్ల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిట్యాల మండల రైతులు కూడా బోర్లు వేయించుకునే ముందు సంబంధిత అధికారుల నుంచి వాల్టా చట్టం ప్రకారం అవసరమైన అన్ని అనుమతులు తప్పనిసరిగా పొందాలని తహశీల్దార్ సూచించారు. ఈ సమావేశంలో బోరుబండ్ల యజమానుల సంఘం మండల అధ్యక్షుడు ఇమ్మాడి వెంకన్నతో పాటు పలువురు బోరుబండ్ల యజమానులు పాల్గొన్నారు.