వేలాయుధం బహుకరించిన వేమూరి కుటుంబం...
వేలాయుధం బహుకరించిన వేమూరి కుటుంబం...
అన్నమయ్య జిల్లా.
చౌడేపల్లి
చౌడేపల్లి పట్టణంలోని గాంధీవీధికి చెందిన వేమూరి నాగార్జున,ఆయన ధర్మపత్ని పారిజాత దంపతులు ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో వళ్ళీ, దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారికి సుమారు నాలుగున్నర కిలోల బరువుగల ఇత్తడి వేలాయుధాన్ని దేవాదాయ,ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో భక్తిపూర్వకంగా బహుకరించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాత దంపతులను వేద ఆశీర్వచనాలతో సత్కరించారు.స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని వేమూరి దంపతులు ఆకాంక్షించారు.ఈ సేవను భక్తులు అభినందించారు.దేవాదాయ,ధర్మాదాయ శాఖ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి రమణ దాతల సేవాభావాన్ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రమణ,ఆలయ సిబ్బంది హరిప్రసాద్, భక్తులు పాల్గొని వేమూరి కుటుంబ దాతృత్వాన్ని ప్రశంసించారు.