వైద్య సహాయానికి తక్షణ స్పందన..
వైద్య సహాయానికి తక్షణ స్పందన.. రూ.2 లక్షల ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న చింతలపూడి నగర పంచాయతీకి చెందిన మక్కిన ప్రమీల, వెంకటేశ్వరరావు దంపతులకు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అండగా నిలిచారు.
వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి రూ.2 లక్షల విలువైన ఎల్ఓసీ లేఖను అందించారు. ఆపద సమయంలో ఆదుకున్న ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ, అత్యవసర సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాటి అప్పారావు, చింతలపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు చీదరాల మధుబాబు, పోతునూరు సొసైటీ అధ్యక్షుడు శీతల గాంధీ, జనసేన నాయకుడు నారపాము ఏసుబాబు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతూ, ప్రతి ఆపదలో ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు.