www.ntodaynews.com
వైసిపి నుంచి టిడిపి వైపు 50 మంది కార్యకర్తల చేరిక
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
వైసిపి నుంచి టిడిపి వైపు 50 మంది కార్యకర్తల చేరిక
నూజివీడు, ఏప్రిల్ 07: నూజివీడు మండలంలోని బోరవంచ గ్రామంలో 50 మంది వైసిపి కార్యకర్తలు, ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి, ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారధి గారి సమక్షంలో ఈ చేరిక జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, "రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టిడిపి లక్ష్యమని" తెలిపారు. "ప్రజల విశ్వాసంతోనే మరింత మంది టిడిపి వైపు అడుగులు వేస్తున్నారు" అని పేర్కొన్నారు.
ఈ చేరికలు టిడిపి బలాన్ని మరింత పెంచుతాయని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు జరగవచ్చునని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.