వైస్సార్సీపీ యువ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నోటు పుస్తకాలు పంపిణీ..
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలో గల ప్రభుత్వ పాఠశాలలో వైస్సార్సీపీ యూజనవిభాగం తరపున విద్యాసామాగ్రి వితరణ జరిగింది. పంచాయతీలోని అన్ని గ్రామాల నుంచి యువకులు పాల్గొన్నారు.
వైస్సార్సీపీ యువ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడుతున్నారు, వారిని ప్రోత్సాహించడం కోసం వారికీ కావలసిన వస్తువులు అందచేశామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వెక్తం చేసారు . ఇలాంటి సహాయం చేసేవారు ఉంటే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుతారని ఆశించారు.
ఈ కార్యక్రమంలో రాగానిపల్లి వైస్సార్సీపీ అధ్యక్షుడు నాగేంద్ర రెడ్డి , సిద్దా రెడ్డి, యూత్ వింగ్ అధ్యక్షుడు నటరాజ, మహేంద్ర , మధుసూదన్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రభాకర్, సుబ్రహ్మణ్యం, నారాయణ, మంజునాథ్ పాల్గొన్నారు.