www.ntodaynews.com
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక
జాతీయం
ఢిల్లీ: వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడులతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడింది.
వీధుల్లో ప్రమాదకర కుక్కలు స్వేచ్ఛగా తిరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పిచ్చి కుక్కలను గుర్తించి యుథనేషియా ద్వారా నిర్మూలించాలని సూచించింది.
కుక్క కాట్ల ఘటనలను అత్యంత సీరియస్గా తీసుకున్న సుప్రీంకోర్టు, ప్రజల భద్రతే ప్రభుత్వాల మొదటి బాధ్యత అని పేర్కొంది.
సమస్యను పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తే అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.