BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 05 April 2026, 11:08 am
Posted by : NTODAY NEWS

వెల్లంకిలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
05 Apr, 2026 - 11:08 AM
244 వీక్షణలు

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆదివారం ఆది జాంబవ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, పేద ప్రజల ఆశాజ్యోతి, దళితుల హక్కుల కోసం జీవితాంతం సేవ చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం చేసిన కృషి నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆది జాంబవ యువజన సంఘం అధ్యక్షులు, నాలుగో వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి (బర్ల) రవి, కోశాధికారి కురుమ వెంకటేష్, సహాయ కార్యదర్శులు జింక లింగయ్య, చెన్ని స్వామి పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు గూని రాజు, కందాల అంజయ్య, మూడో వార్డు సభ్యులు నకిరేకంటి నరేష్ తదితరులు హాజరయ్యారు.

కుల పెద్దలు ఎర్రోళ్ల నరసింహ, తలారి నరసింహ, నకిరేకంటి రవీందర్, బర్ల బాబురావు, నకిరేకంటి ఎల్లయ్య, జంపాల అరవింద్, నకిరేకంటి డా. అశోక్, నకిరేకంటి నరేందర్, జింక గోవర్ధన్, కురుమ మహేందర్, నకిరేకంటి గణేష్, లింగయ్య, అనిల్, యాదయ్య, మహేష్, శ్రీరాములు, రాములు, శంకరయ్య, యాదయ్య తదితర గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని, ఆయన చూపిన దారిలో నడవడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.