వెంకట్రావుపేట పీహెచ్సీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తనిఖీ
మంచిర్యాల జిల్లా | లక్షెట్టిపేట మండలం | NTODAY NEWS
లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లను తనిఖీ చేసిన కలెక్టర్, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ), ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్ నలిమెల రాజు, జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.