విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని భువనగిరిలో మహాధర్నా
విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని భువనగిరిలో మహాధర్నా
విద్యార్థులకు రావలసిన ₹10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో వేలాది మంది విద్యార్థులతో భారీ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ 10,000 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని, విద్యార్థుల వ్యతిరేక జీవో నంబర్ 9 మరియు ఆర్ఆర్ (RR) యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య మరియు విద్యార్థుల స్కాలర్షిప్లపై సీఎం చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీకి లక్షల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం, విద్యార్థుల ఫీజులకు నిధులు లేవనడం విడ్డూరమని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ విమర్శించారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని,
సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి, మెస్ చార్జీలు పెంచాలని కోరారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 5 లక్షల రూపాయల భరోసా కార్డు అందరికీ వర్తింపజేయాలి అని .ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి, ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని నియమించాలని అన్నారు. డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఎంపీ ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి మరియు బీసీ సంఘాల నాయకులు పల్లపు దుర్గయ్య, సాయిలు, వేముల అనిల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.