BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 01 April 2026, 07:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యాసేవకుడు చెన్నకేశవరెడ్డి కన్నుమూత… చాట్రాయిలో విషాదఛాయలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Apr, 2026 - 07:39 AM
438 వీక్షణలు

విద్యాసేవకుడు చెన్నకేశవరెడ్డి కన్నుమూత… చాట్రాయిలో విషాదఛాయలు

చాట్రాయి ఏప్రిల్ 1: చాట్రాయి వికాస్ పబ్లిక్ స్కూల్ అధినేత పాములపాటి చెన్నకేశవరెడ్డి మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే చాట్రాయి మండలంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

గ్రామీణ విద్యాభివృద్ధికి జీవితాన్నే అంకితం చేసిన చెన్నకేశవరెడ్డి, సుమారు రెండు దశాబ్దాల క్రితం వికాస్ పబ్లిక్ స్కూల్‌ను స్థాపించి, సాధారణ కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే దీక్షతో ముందుకు సాగారు. పేద విద్యార్థులకు ఫీజుల భారాన్ని తగ్గిస్తూ, కొంతమందికి పూర్తిగా ఉచిత విద్య అందించి, వారి భవిష్యత్తుకు బాటలు వేసిన గురువుగా పేరుపొందారు. ఆయన చేతిలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు నేడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి సమాజంలో గౌరవప్రద స్థానం సంపాదించారు.

“విద్యే అసలైన సంపద” అనే నమ్మకంతో విద్యాసేవలో నిస్వార్థంగా పనిచేసిన చెన్నకేశవరెడ్డి, క్రమశిక్షణకు ప్రతీకగా, ప్రేమాభిమానాలకు నిలయంగా గుర్తింపు పొందారు. ఆయన మరణంతో విద్యారంగం ఒక గొప్ప సేవకుడిని కోల్పోయిందని స్థానికులు భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బంధువులు, శిష్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆయనకు నివాళులు అర్పించేందుకు సిద్ధమవుతున్నారు. మృతదేహాన్ని చాట్రాయికి తీసుకువస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.