BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

విజయవాడ పటమటలో డ్రగ్ అధికారుల మెరుపు దాడులు..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 06:09 AM
4 వీక్షణలు

విజయవాడ పటమటలో డ్రగ్ అధికారుల మెరుపు దాడులు.. మెడికల్ షాపుల్లో తనిఖీలు

శానిటైజర్ అమ్మకాలపై ఆరా.. మత్తు కోసం వినియోగిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తం

విజయవాడ పటమట సర్కిల్ పరిధిలో డ్రగ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని రకాల మత్తు మందుల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పలు మెడికల్ షాపుల్లో సోదాలు చేపట్టారు.

ఇటీవల శానిటైజర్ అమ్మకాలు అనూహ్యంగా పెరగడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మోతాదుకు మించి శానిటైజర్ విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశంపై వివరాలు సేకరించారు.

శానిటైజర్‌ను కేవలం చేతుల శుభ్రత కోసం మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు. కొందరు వ్యక్తులు మత్తు కోసం శానిటైజర్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

మెడికల్ షాపుల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, అనుమానాస్పద విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ అధికారులు స్పష్టం చేశారు.