BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

వికాస్‌ కళాశాల హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 08:31 PM
429 వీక్షణలు

వికాస్‌ కళాశాల హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట, ఏప్రిల్‌ 7:

స్థానిక వికాస్‌ విద్యాసంస్థల హాస్టల్‌లో మంగళవారం తెల్లవారుజామున ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన మల్లాది కార్తీక్‌ (20) ఇక్కడ డి.ఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ ఆవరణలోని హాస్టల్‌ మూడో అంతస్తులో ఉంటున్న కార్తీక్‌, తెల్లవారేసరికి తన గదిలో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు.

నిద్రలేచిన తోటి విద్యార్థులు కార్తీక్‌ ఉరివేసుకోవడం చూసి నిర్ఘాంతపోయి, వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కళాశాల చైర్మన్‌ను వివరణ కోరగా, విద్యార్థి మృతి చెందడం బాధాకరమని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

చేతికందివచ్చిన కొడుకు అకాల మరణంతో తాతకుంట్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.