BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

వికాస్‌ కళాశాల హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 08:31 PM
383 వీక్షణలు

వికాస్‌ కళాశాల హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట, ఏప్రిల్‌ 7:

స్థానిక వికాస్‌ విద్యాసంస్థల హాస్టల్‌లో మంగళవారం తెల్లవారుజామున ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన మల్లాది కార్తీక్‌ (20) ఇక్కడ డి.ఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ ఆవరణలోని హాస్టల్‌ మూడో అంతస్తులో ఉంటున్న కార్తీక్‌, తెల్లవారేసరికి తన గదిలో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు.

నిద్రలేచిన తోటి విద్యార్థులు కార్తీక్‌ ఉరివేసుకోవడం చూసి నిర్ఘాంతపోయి, వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కళాశాల చైర్మన్‌ను వివరణ కోరగా, విద్యార్థి మృతి చెందడం బాధాకరమని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

చేతికందివచ్చిన కొడుకు అకాల మరణంతో తాతకుంట్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.