BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

విస్సన్నపేటలో 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ – ఎరువుల గ్రామసభ నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:43 PM
51 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి తెలిపారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులు డాబా శ్రీనివాసు, ఆకుల రాధాకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ అభినేని చంద్రశేఖర్ బాబు, షేక్ యాసిన్ రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు.

అనంతరం మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎరువుల గ్రామసభ, ధర్తీ మాత బచావో క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, శాస్త్రీయ సాగు పద్ధతులను రైతులు అనుసరించాలని సూచించారు.

నేల సారవంతంగా ఉంటే పండే పంటలు నాణ్యంగా ఉండటంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వివరించారు. అలాగే యూరియా, డీఏపీ గుళికల బదులుగా నానో యూరియా, నానో డీఏపీ వినియోగించాలని రైతులకు సూచించారు.

నానో యూరియా ధర రూ.366 కాగా, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో రూ.249కే అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. నానో ఎరువులను పిచికారీ చేయడం ద్వారా మొక్కలు అధిక శాతం పోషకాలను గ్రహించి, ఎరువుల వృథా తగ్గుతుందని వివరించారు.

మండలంలోని అన్ని సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో ఎంఆర్‌పీ ధరలకే ఎరువులు అందుబాటులో ఉంటాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే రైతులందరూ ఏపీఎంఎస్ 2.0 యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఈ-క్రాప్ నమోదు, ఎరువుల కొనుగోలు, ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ ఉషారాణి, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.