BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

విస్సన్నపేటలో 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ – ఎరువుల గ్రామసభ నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:43 PM
100 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి తెలిపారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులు డాబా శ్రీనివాసు, ఆకుల రాధాకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ అభినేని చంద్రశేఖర్ బాబు, షేక్ యాసిన్ రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు.

అనంతరం మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎరువుల గ్రామసభ, ధర్తీ మాత బచావో క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, శాస్త్రీయ సాగు పద్ధతులను రైతులు అనుసరించాలని సూచించారు.

నేల సారవంతంగా ఉంటే పండే పంటలు నాణ్యంగా ఉండటంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వివరించారు. అలాగే యూరియా, డీఏపీ గుళికల బదులుగా నానో యూరియా, నానో డీఏపీ వినియోగించాలని రైతులకు సూచించారు.

నానో యూరియా ధర రూ.366 కాగా, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో రూ.249కే అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. నానో ఎరువులను పిచికారీ చేయడం ద్వారా మొక్కలు అధిక శాతం పోషకాలను గ్రహించి, ఎరువుల వృథా తగ్గుతుందని వివరించారు.

మండలంలోని అన్ని సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో ఎంఆర్‌పీ ధరలకే ఎరువులు అందుబాటులో ఉంటాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే రైతులందరూ ఏపీఎంఎస్ 2.0 యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఈ-క్రాప్ నమోదు, ఎరువుల కొనుగోలు, ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ ఉషారాణి, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.