www.ntodaynews.com
విస్సన్నపేటలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
విస్సన్నపేటలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు
విస్సన్నపేట మండలంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూలలో నిలబడుతూ ఇంధనం కోసం బారులు తీరారు. కొందరు ముందస్తు జాగ్రత్తగా క్యాన్లలో కూడా పెట్రోల్ నింపుకుంటూ కనిపించారు. పెట్రోల్ కొరత వస్తుందన్న ప్రచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
అయితే మండలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని మండల తహసీల్దార్ కే. లక్ష్మీ కళ్యాణి సూచించారు.