www.ntodaynews.com
విశాఖ మత్స్యకారులు సురక్షితం: మంత్రి అచ్చెన్న
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
AP: ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖకు చెందిన మత్స్యకారులను సురక్షితంగా రక్షించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఒడిశా మెరైన్ పోలీస్, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. ఒడిశా మెరైన్ పోలీసులు సకాలంలో స్పందించి బోటు యజమాని చిన్నయ్యతో పాటు మొత్తం 10 మంది మత్స్యకారులను రక్షించామన్నారు.