విశాఖలో ఏఐజీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు.
మంత్రి లోకేష్కు హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీలు మతుకుమిల్లి భరత్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఏపీ గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి లోకేష్ విశాఖలోని ఎండాడలో ఏర్పాటు చేయనున్న ఏఐజీ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విశాఖలో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలను ఏఐజీ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 9 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు సమాచారం.