BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

వర్షాలు కురవాలని పెనుగొలనులో నగర సంకీర్తన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jul, 2026 - 08:43 AM
87 వీక్షణలు

పెనుగొలను, జూలై 26: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ ఆదివారం భక్తులు నగర సంకీర్తన నిర్వహించారు.

ఈ సందర్భంగా శిరిడి సాయిబాబాకు అభిషేకం చేసి నూతన వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సాయిబాబా ఆలయం నుంచి భగవన్నామస్మరణ చేస్తూ గ్రామ ప్రధాన వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డా. జి. నరసింహారావు, సుగల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, సుగ్గల విష్ణు తదితరులు పాల్గొన్నారు.

శనివారం రాత్రి గ్రామ బొడ్రాయి సెంటర్‌లోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు బొలగాని నాగయ్య, కోట దాసు తెలిపారు.

ఈనెల 29న గురుపౌర్ణమి సందర్భంగా పెనుగొలను శివాలయం ప్రాంగణంలోని శిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ తెలిపారు. గురువుల సన్మానం, సాయిబాబాకు దీపోత్సవం, భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.