వ్యాక్సిన్లు భవిష్యత్ ఆరోగ్య భద్రతకు రక్షణ కవచం: ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి, జూలై 29: చింతలపూడి బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక పాఠశాల టీకా కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 5 సంవత్సరాల చిన్నారులకు డీపీటీ (డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం) టీకా, అలాగే 10, 16 సంవత్సరాల విద్యార్థులకు టీడీ (ధనుర్వాతం, డిఫ్తీరియా) టీకాలను అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు టీకాలు అత్యంత కీలకమని అన్నారు. వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో టీకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రభుత్వం అందించే అన్ని టీకాలను తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ అఫ్రిన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాటూరి చక్రధరరావు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.