వ్యక్తి ఆకస్మిక మృతి : కేసు నమోదు
వ్యక్తి ఆకస్మిక మృతి : కేసు నమోదు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని దుబ్బాక గ్రామానికి చెందిన రేవనాల ఐలయ్య (46) అనే వ్యక్తి ఆకస్మికంగా అస్వస్థతకు గురై మృతి మృతి చెందాడు రామన్నపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 5న సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఐలయ్య తన భార్య పద్మ, కుమార్తె శివమణితో కలిసి దుబ్బాక రోడ్డులో ఉన్న తమ వ్యవసాయ పొలానికి వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం 5:00 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఐలయ్య ఒక్కసారిగా నేలపై పడిపోయారు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై, రాత్రి 10:30 గంటల సమయంలో వెంటనే ఆయనను రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించి రాత్రి 11:00 గంటలకు ఐలయ్య మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య రేవనాల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట ఎస్సై సతీష్ కేసు నమోదు చేసుకుని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.