www.ntodaynews.com
ఉచిత వైద్య శిబిరాల సందర్శన
తెలంగాణ
ప్రజా పాలనలో భాగంగా ఉచిత వైద్య శిబిరాల సందర్శన: డాక్టర్ వెంకటరమణ
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ శనివారం సందర్శించారు.
హౌసింగ్ బోర్డ్, కట్ట రాంపూర్, విద్యానగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాలను పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ మార్చి 6 నుండి జూన్ 12 వరకు కొనసాగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకోవాలని సూచించారు. శిబిరాల్లో అందుబాటులో ఉన్న ఉచిత పరీక్షలు, మందులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శిబిరాల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలు
తల్లీ-బిడ్డ సంరక్షణ: గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ
దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ: 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు
ఉచిత పరీక్షలు: రక్తహీనత (Anemia), క్షయ (TB), ఎయిడ్స్ నిర్ధారణ మరియు చికిత్స
ప్రత్యేక శ్రద్ధ: కౌమారదశ బాలికలు, వృద్ధుల ఆరోగ్య సమస్యలకు ప్రత్యేక వైద్య సేవలు
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ క్షేత్రస్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సన జవేరియా, డీపీఎం స్వామి, డాక్టర్ ప్రణవ్, డాక్టర్ నవ్య, డాక్టర్ రాజ్ కుమార్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
#Karimnagar #PrajaPalana #FreeMedicalCamp #PublicHealth #TelanganaNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube