BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

రాయికల్‌పై గులాబీ జెండా ఎగురవేస్తాం

తెలంగాణ
07 Feb, 2026 - 09:10 AM
130 వీక్షణలు
రాయికల్‌పై గులాబీ జెండా ఎగురవేస్తాం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం: దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లా తొలి జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్ శుక్రవారం రాయికల్ పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 1, 5, 10, 11, 12వ వార్డుల పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులు కైరం రమణ, వల్లకొండ సంధ్య, పెండాల వనిత, మారంపల్లి సాయి కుమార్, సిర్ప సంతోష్‌లకు ఆమె మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రెండేళ్లు పూర్తయినా రాయికల్ పట్టణంలో ఒక్క అభివృద్ధి పనికీ శ్రీకారం చుట్టలేదని విమర్శించారు. పట్టణంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ పాలనలోనే సాధ్యమైందని పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని, కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంపై తప్పకుండా గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలిగేటి అనిల్ కుమార్, కైరం కట్కం రవి, శ్రీధర్ రెడ్డి, బర్కాం మల్లేష్, మహేశ్వర్ రావు, సాయి కుమార్, మహేష్ గౌడ్, చిట్ల రమణ, రాజేందర్ గౌడ్, ప్రశాంత్ రావు, చాంద్ పాషా, శ్రీను, లక్ష్మణ్, రాంప్రసాద్, వెంకటేష్, వేణు తదితరులు పాల్గొన్నారు. #Raikal #BRS #MunicipalElections #PinkFlag #GrassrootsCampaign #TelanganaPolitics #VoteForCar #UrbanDevelopment Follow us on Website Facebook Instagram YouTube