BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

తెలంగాణ
01 Jan, 2026 - 07:06 PM
52 వీక్షణలు

చిన్నకాపర్తి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్, మండల విద్యాధికారి సైదా నాయక్‌తో కలిసి తాము చదువుకున్న పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ, తాము చదువుకున్న పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని, పాఠశాల అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. గ్రామంలోని పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఎంపికైందని, ఆ పథకం ద్వారా వచ్చే నిధులతో విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యాన్ని కల్పించి, అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా త్వరలో చర్యలు చేపడతామని అన్నారు. అలాగే విద్యార్థుల కోసం సైన్స్ ప్రయోగాలకు ప్రత్యేక సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనంలోని సీలింగ్‌ను త్వరలోనే మరమ్మతులు చేయించి, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అదే పాఠశాలకు సర్పంచ్‌గా వచ్చిన ఆవుల సుందర్‌ను, ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘును, మండల విద్యాధికారి సైదా నాయక్‌తో పాటు ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ఆవుల మాధవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube