BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

తెలంగాణ
01 Jan, 2026 - 07:06 PM
135 వీక్షణలు

చిన్నకాపర్తి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్, మండల విద్యాధికారి సైదా నాయక్‌తో కలిసి తాము చదువుకున్న పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ, తాము చదువుకున్న పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని, పాఠశాల అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. గ్రామంలోని పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఎంపికైందని, ఆ పథకం ద్వారా వచ్చే నిధులతో విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యాన్ని కల్పించి, అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా త్వరలో చర్యలు చేపడతామని అన్నారు. అలాగే విద్యార్థుల కోసం సైన్స్ ప్రయోగాలకు ప్రత్యేక సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనంలోని సీలింగ్‌ను త్వరలోనే మరమ్మతులు చేయించి, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అదే పాఠశాలకు సర్పంచ్‌గా వచ్చిన ఆవుల సుందర్‌ను, ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘును, మండల విద్యాధికారి సైదా నాయక్‌తో పాటు ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ఆవుల మాధవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube