BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 01 January 2026, 07:06 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

తెలంగాణ
01 Jan, 2026 - 07:06 PM
175 వీక్షణలు

చిన్నకాపర్తి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్, మండల విద్యాధికారి సైదా నాయక్‌తో కలిసి తాము చదువుకున్న పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ, తాము చదువుకున్న పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని, పాఠశాల అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. గ్రామంలోని పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఎంపికైందని, ఆ పథకం ద్వారా వచ్చే నిధులతో విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యాన్ని కల్పించి, అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా త్వరలో చర్యలు చేపడతామని అన్నారు. అలాగే విద్యార్థుల కోసం సైన్స్ ప్రయోగాలకు ప్రత్యేక సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనంలోని సీలింగ్‌ను త్వరలోనే మరమ్మతులు చేయించి, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అదే పాఠశాలకు సర్పంచ్‌గా వచ్చిన ఆవుల సుందర్‌ను, ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘును, మండల విద్యాధికారి సైదా నాయక్‌తో పాటు ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ఆవుల మాధవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube