www.ntodaynews.com
యూడీఐడీ కార్డుతో దివ్యాంగులకు రైలు టికెట్లపై 75 శాతం వరకు రాయితీ
జాతీయం
యూడీఐడీ కార్డుతో దివ్యాంగులకు రైలు టికెట్లపై 75 శాతం వరకు రాయితీ
భారతీయ రైల్వేల్లో ప్రయాణించే దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. యూనిక్ డిసేబిలిటీ ఐడీ (యూడీఐడీ) కార్డు కలిగిన అర్హులైన దివ్యాంగులు రైలు టికెట్ ధరపై రాయితీ పొందవచ్చని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వైకల్యం రకం, ప్రయాణించే కోచ్ (తరగతి) ఆధారంగా గరిష్ఠంగా 75 శాతం వరకు టికెట్ ఛార్జీలో రాయితీ లభిస్తుంది.
ఈ సౌకర్యాన్ని పొందాలంటే దివ్యాంగుడికి కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. అర్హులైన వారు యూడీఐడీ కార్డు ఆధారంగా రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ బుక్ చేసుకుని రాయితీ ప్రయోజనాన్ని పొందవచ్చు.