www.ntodaynews.com
యోగశిక్షణా తరగతుల బ్రోచర్ ఆవిష్కరణ
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
రామన్నపేట
శ్రీ శిరిడి సాయి అష్టాంగ తొమ్మిది రోజుల యోగశిక్షణా తరగతులు
రామన్నపేటలో ఉన్నటువంటి అమృతవనం అగ్రిఫామ్ రిసార్ట్లో 29వ తారీకు నుంచి ఆరో తారీకు వరకు నిర్వహించడం జరుగుతున్నది. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు శిక్షణ నిర్వహించబడును. ఈ శిక్షణ తరగతుల బ్రోచర్ను గౌరవనీయులు రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ డి నాగరాజు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది, ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు శ్రీ యోగేశ్వర్ అమృతం అగ్రిఫామ్ రిసార్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ కడారి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు, ఈ తొమ్మిది రోజుల శిక్షణలో వ్యాయామాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ధ్యానం, ఆసనాలు నేర్పించడంతోపాటుగా సంపూర్ణ ఆరోగ్యానికి పచ్చి కూరగాయలతో అందించే అమృత ఆహారం అందించబడుతుంది అని గురూజీ తెలియజేశారు. ఈ శిక్షణలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకి యోగ సాధన చాలా అవసరమని ప్రతి ఒక్కరి జీవితంలో యోగాన్ని ఒక భాగంగా చేర్చుకోవాలన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ డి నాగరాజు మాట్లాడుతూ పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అటువంటి ఆరోగ్యాన్ని యోగసాధంతో కాపాడుకోవడం చాలా ఉత్తమమైన మార్గమని తెలియజేశారు. ఈ శిక్షణలో పాల్గొనదలచిన వారు ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు 9603256572.