BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

యోగశిక్షణా తరగతుల బ్రోచర్ ఆవిష్కరణ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
26 Mar, 2026 - 03:18 PM
189 వీక్షణలు
శ్రీ శిరిడి సాయి అష్టాంగ తొమ్మిది రోజుల యోగశిక్షణా తరగతులు
రామన్నపేటలో ఉన్నటువంటి అమృతవనం అగ్రిఫామ్ రిసార్ట్లో 29వ తారీకు నుంచి ఆరో తారీకు వరకు నిర్వహించడం జరుగుతున్నది. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు శిక్షణ నిర్వహించబడును. ఈ శిక్షణ తరగతుల బ్రోచర్ను గౌరవనీయులు రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ డి నాగరాజు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది, ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు శ్రీ యోగేశ్వర్ అమృతం అగ్రిఫామ్ రిసార్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ కడారి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు, ఈ తొమ్మిది రోజుల శిక్షణలో వ్యాయామాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ధ్యానం, ఆసనాలు నేర్పించడంతోపాటుగా సంపూర్ణ ఆరోగ్యానికి   పచ్చి కూరగాయలతో అందించే అమృత ఆహారం అందించబడుతుంది అని గురూజీ తెలియజేశారు. ఈ శిక్షణలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకి యోగ సాధన చాలా అవసరమని ప్రతి ఒక్కరి జీవితంలో యోగాన్ని ఒక భాగంగా చేర్చుకోవాలన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ డి నాగరాజు మాట్లాడుతూ పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అటువంటి ఆరోగ్యాన్ని యోగసాధంతో కాపాడుకోవడం చాలా ఉత్తమమైన మార్గమని తెలియజేశారు. ఈ శిక్షణలో పాల్గొనదలచిన వారు ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు 9603256572.