www.ntodaynews.com
12వ డివిజన్లో వార్డు సభ నిర్వహణ
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో గురువారం వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ధరణి మధుకర్ పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కార్పొరేషన్ కట్టుబడి ఉందన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వార్డు అభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రమోద్ రావు, కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, ఆర్వో కరుణాకర్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు