www.ntodaynews.com
2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: సిద్ధరామయ్య
జాతీయం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2028లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
రాజకీయాల్లో అవినీతి పెరుగుతుండటం ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే వయసు పెరగడం, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ప్రజా జీవితానికి దూరం కాబోనని, ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ ప్రకటన కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.