BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

₹22 వేల కోట్ల కేసు.. రూ.6.5 కోట్లతో సెటిల్‌మెంట్‌?

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 04:53 PM
30 వీక్షణలు

₹22 వేల కోట్ల కేసు.. రూ.6.5 కోట్లతో సెటిల్‌మెంట్‌? మాల్యా సంచలన వ్యాఖ్యలు.. రుణ రికవరీ వ్యవస్థపై మళ్లీ రగిలిన చర్చ

"ఒకే దేశం.. ఒకే చట్టం అంటారు.. మరి రుణాల వసూళ్లలో ఈ తేడాలేంటి?" అంటూ ప్రశ్నించిన విజయ్ మాల్యా

తన కేసులో రూ.6,203 కోట్ల రుణానికి రూ.14,100 కోట్లు రికవరీ చేశారన్న మాల్యా.. ఇతరుల విషయంలో మాత్రం భారీ మినహాయింపులా? అంటూ నిలదీత

దివాలా పరిష్కార ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. జీ సంస్థల వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన భారీ రుణ కేసు విషయంలో వెలువడిన వార్తలపై పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రూ.22 వేల కోట్లకు పైగా ఉన్న దివాలా కేసును కేవలం రూ.6.5 కోట్ల చెల్లింపుతో ముగించుకునే అవకాశం కల్పించారన్న వార్తలపై మాల్యా తీవ్రంగా స్పందించారు. రుణాల రికవరీ విషయంలో దేశంలో ఒకే విధమైన విధానం అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు.

"నాకు ఒక న్యాయం.. మరికొందరికి మరో న్యాయమా?"

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విజయ్ మాల్యా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. బ్యాంకులు తనపై తీసుకున్న చర్యలు, రికవరీ చేసిన మొత్తాలను గుర్తు చేశారు.

తనపై ఉన్న రూ.6,203 కోట్ల రుణాలకు సంబంధించి బ్యాంకులు రూ.14,100 కోట్లకు పైగా ఆస్తులను రికవరీ చేశాయని పేర్కొన్నారు. అయితే కొందరి విషయంలో మాత్రం భారీ మొత్తాల రుణాలు ఉన్నప్పటికీ తక్కువ మొత్తాలతో కేసులు ముగిసిపోతున్నాయని ప్రశ్నించారు.

"భారత రుణ రికవరీ వ్యవస్థలో సమానత్వం ఎక్కడ?"

అంటూ మాల్యా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోనూ, ఆర్థిక నిపుణుల్లోనూ చర్చకు కారణమయ్యాయి.

దివాలా చట్టంపై మరోసారి చర్చ

దేశంలో పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న కంపెనీలు, వ్యక్తుల కోసం దివాలా పరిష్కార చట్టం తీసుకొచ్చారు. రుణదాతలకు వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బు తిరిగి వచ్చేలా చేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. అయితే కొన్ని కేసుల్లో భారీ రుణాలు తక్కువ మొత్తాలతో పరిష్కారం కావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.

మరోవైపు దివాలా పరిష్కార ప్రక్రియలో ఆస్తుల విలువ, కంపెనీ పరిస్థితి, రుణదాతల అంగీకారం వంటి అనేక అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

మాల్యా వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి పాత వివాదం

విజయ్ మాల్యా బ్యాంకులకు వేల కోట్ల రుణాలు చెల్లించకుండా విదేశాలకు వెళ్లిపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై భారత దర్యాప్తు సంస్థలు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే తాజాగా రుణ పరిష్కారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద రుణగ్రహీతల విషయంలో ప్రభుత్వాలు, బ్యాంకులు అనుసరిస్తున్న విధానాలపై మరోసారి రాజకీయ, ఆర్థిక చర్చకు దారితీశాయి.

ఒకే దేశం.. ఒకే రుణ వ్యవస్థ ఉండాలా?

లేక కేసును బట్టి పరిష్కారాలు మారాలా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది.