BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

పిల్లల్ని కనండి.. ఒక్కో బిడ్డకు రూ.55 లక్షల వరకు సాయం!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 02:55 PM
26 వీక్షణలు

పిల్లల్ని కనండి.. ఒక్కో బిడ్డకు రూ.55 లక్షల వరకు సాయం! జనన రేటు తగ్గుదలపై సింగపూర్ కీలక నిర్ణయం.. భారీ కుటుంబ సహాయ ప్యాకేజీ ప్రకటన

పుట్టిన బిడ్డకు 17 ఏళ్ల వరకు వివిధ రూపాల్లో ఆర్థిక మద్దతు

సింగపూర్ ప్రభుత్వం కుటుంబాలను ప్రోత్సహించేందుకు భారీ సహాయ ప్యాకేజీని ప్రకటించింది. దేశంలో తగ్గుతున్న జనన రేటును పెంచే లక్ష్యంతో ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ ఈ కొత్త కుటుంబ మద్దతు పథకాన్ని ప్రకటించారు. 

ఈ పథకం కింద సింగపూర్ పౌరుడిగా పుట్టిన ప్రతి బిడ్డకు పుట్టినప్పటి నుంచి 17 ఏళ్ల వయసు వచ్చే వరకు దాదాపు 70,000 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.55 లక్షలు) వరకు ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలు అందనున్నాయి. 

ఈ సహాయంలో భాగంగా పుట్టిన వెంటనే నగదు ప్రోత్సాహకం, పిల్లల అభివృద్ధి ఖాతాలకు నిధులు, విద్యా అవసరాలకు ఆర్థిక సహాయం వంటి పలు అంశాలు ఉంటాయి. కొత్త ప్యాకేజీలోనే ఒక్కో చిన్నారికి గరిష్టంగా 62,000 సింగపూర్ డాలర్ల వరకు సహాయం అందించనున్నారు. 

జనన రేటు చారిత్రాత్మకంగా తగ్గిపోతుండటంతో సింగపూర్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పిల్లల పెంపకం ఖర్చులు తగ్గించడం, తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా ఎక్కువ మంది దంపతులు కుటుంబాలను ప్రారంభించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

కుటుంబాలకు మరింత సమయం అందించేందుకు పిల్లల సంరక్షణ సెలవుల పెంపు, పాఠశాల ముందు విద్యా ఖర్చులపై ఉపశమన చర్యలు కూడా ప్రకటించారు.