2-3 నెలల్లో ఉయ్యూరు టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం: వైవీబీ రాజేంద్రప్రసాద్
కృష్ణా జిల్లా, ఉయ్యూరు: ఉయ్యూరులో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను మరో రెండు నుంచి మూడు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆదివారం ఉయ్యూరు టౌన్ పార్టీ అధ్యక్షుడు జంపాన గురునాధరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా 14వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 2014-19 మధ్య ప్రారంభించి 80 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నిలిపివేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను మళ్లీ ప్రారంభించామని, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి రెండు లేదా మూడు నెలల్లో లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పూర్తి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు జంపాన పూర్ణచంద్రరావు, అబ్దుల్ కుదూస్, జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, సీనియర్ నాయకుడు రత్నం బుజ్జి, నాయకులు జంపాన వీర శ్రీనివాస్, 14వ వార్డు కౌన్సిలర్ దుర్గాప్రసాద్, మాజీ కౌన్సిలర్లు పరిమి సలోమి సంతోషి, తెనాలి పద్మావతి, కోరాడ వెంకటలక్ష్మి, నడిమింటి పైడయ్య, మాదినేని జ్యోతి, చలపాటి మణికంఠ, బొర్రా సుబ్బారావు, లక్ష్మణరావు, కటారి తిరుపతిరావు, రామనోళ్ల శ్రీకాంత్, చింతయ్య, జంపాన అర్జున్రావు, ఆరేపల్లి సుబ్బారావు, రాజులపాటి వెంకట్, ఆశాదేవి, మోదుగు కుటుంబరావు, కొలగాని సాంబశివరావు, చిట్టీ తదితరులు పాల్గొన్నారు.