BREAKING
ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి
www.ntodaynews.com

40 ఏళ్ల పసుపు జెండా ప్రస్థానం.....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 09:17 PM
16 వీక్షణలు

40 ఏళ్ల పసుపు జెండా ప్రస్థానం.. యనమద్ది నాగమల్లేశ్వరరావు తిరిగి టీడీపీలోకి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం చింతలనర్వ

చింతలనర్వ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు యనమద్ది నాగమల్లేశ్వరరావు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండాను మోస్తూ పార్టీ కోసం పనిచేసిన ఆయన గతంలో చింతలనర్వ గ్రామ సర్పంచిగా, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, తెలుగు యువత గంపలగూడెం మండల అధ్యక్షుడిగా, ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహించారు.

గత రెండేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న యనమద్ది నాగమల్లేశ్వరరావు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా తనను ఆకర్షించాయని పేర్కొన్నారు.

శుక్రవారం చింతలనర్వ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు యనమద్ది నాగమల్లేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకుడు తిరిగి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. అనుభవజ్ఞులైన నాయకుల సూచనలు, సలహాలతో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం సమష్టిగా ముందుకు సాగుతామని తెలిపారు.

కష్టకాలంలో కూడా పార్టీ సిద్ధాంతాలను నమ్మి జెండాను మోసిన నాయకులు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో ఎల్లప్పుడూ తగిన గౌరవం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.